
అంకుషాపూర్ గ్రామపంచాయతీలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం ప్రారంభమైంది. గ్రామ సర్పంచ్ బైకాని రమా బాలరాజు యాదవ్ పర్యవేక్షణలో రోడ్ల ఇరువైపులా పేరుకుపోయిన చెత్త, ముళ్లపొదలు, మురుగును తొలగించే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. గ్రామంలో పరిశుభ్రమైన వాతావరణం నెలకొల్పడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగుతోంది.



















