
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కొండా సుస్మిత చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కంచ రాములు చేపట్టిన 48 గంటల నిరాహార దీక్షను జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి లక్ష్మీ నారాయణ చేతుల మీదుగా శనివారం విరమించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కొండా సుస్మిత వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


















