కొత్తగూడెం ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డివిజనల్ మేనేజర్ తాటి శ్రావణిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
తాటి శ్రావణి పై రూ.28 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో రేంజర్ రాజేందర్ మరియు మధ్యవర్తి గోపాలకృష్ణ కూడా ఉన్నారు.
ఏసీబీ అధికారులు అన్నపురెడ్డిపల్లి మండలం సీతాయిగూడెంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వారు టన్నుకు 90 రూపాయల చొప్పున మొత్తం రూ.28 లక్షలు డిమాండ్ చేసినట్లు వెల్లడించారు.
రేంజర్ ను ఏసీబీ అధికారులు హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. శ్రావణి అప్పటినుండి పరారిలో ఉన్నారు.





